ఇది భూమిని తాకితే భూమి మటాష్ అంటున్న సైంటిస్ట్స్
కొద్దిరోజుల్లో భూమికి ముప్పు పొంచివుందా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు నాసా శాస్ర్తవేత్తలు. భూమిపైకి దూసు
కొస్తున్న ఓ గ్రహశకలం ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. సెప్టెంబరు ఒకటిన భూమికి మరింత దగ్గరగా రావచ్చని
అంచనా వేస్తున్నారు. దాదాపు 4.4 కిమీల విస్తీర్ణం కలిగిన ఈ ఆస్టరాయిడ్ కనుక భూమిని తాకితే ప్రళయం తప్పదని
అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు భూమికి దగ్గరగా వచ్చిన ఆస్టరాయిడ్స్ వల్ల ప్రమాదాలేవీ జరగలేదని, ఇప్పుడొస్తున్న గ్రహశకలం పరిమాణం పెద్దదిగా ఉండటంతో ఆందోళన నెలకొంది. 20 ఏళ్ల కిందటే నాసా శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఈనెల చివరికి ఇది భూమికి దగ్గరగా వస్తుందన్నారు. నాలుగేళ్ల కిందట 20 మీటర్ల గ్రహశకలంతో విధ్వంసం తప్పదని భావించారు. ఆస్టరాయిడ్ విస్తీర్ణం ఒక కిలోమీటర్ దాటితే ప్రమాద స్థాయి తీవ్రంగా వుంటుందని, ఇప్పటివరకు 880 గ్రహశకలాలు భూమికి సమీపంలో ఉన్నట్లు నాసా గుర్తించింది.
0 comments:
Post a Comment