రాత్రి 10 తర్వాతే ప్రసారం చేయండి
సోనీ టీవీలో ప్రసారం అవుతున్న 'పెహ్రిదార్ పియా కి' అనే హిందీ టీవీ సీరియల్ వివాదాస్పదం అయింది. ఈ సీరియల్ లో కొన్ని సీన్లు వివాదాస్పదంగా ఉండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదులపై ప్రసార మాధ్యమాల సంబంధిత విషయాల ఫిర్యాదుల మండలి (బీసీసీసీ) స్పందించింది. ఆ సీరియల్ రాత్రి 10 గంటల తర్వాతే ప్రసారం చేయాలని ఆదేశించింది.
తొమ్మిదేళ్ల బాలుడు, 18 ఏళ్ల యువతిని ప్రేమ, పెళ్లి లాంటి కాన్సెప్టుతో ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. ఇలాంటి సీరియల్స్ పిల్లల్లో చెడు ప్రభావాన్ని చూపుతాయని, అందుకే రాత్రి పూట మాత్రమే వీటిని ప్రసారం చేయాలని ఆదేశించారు.
బాల్య వివాహాలను ప్రోత్సహించేలా 'పెహ్రిదార్ పియా కి' సీరియల్ సీన్లు ఉండటం ఏమిటని, ఇలాంటి కాన్సెప్టుతో సమాజంలోకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చాలా మంది ఫిర్యాదులు చేశారు.
గత నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ కాన్సెప్టు కొత్తగా ఉండటంతో మంచి రేటింగ్ వచ్చింది. అయితే బాల్య వివాహాలను ప్రోత్సహించేలా, 9 ఏళ్ల పిల్లాడు తనకంటే రెట్టింపు వయసు ఉన్న యువతిని పెళ్లాడటం లాంటి విరుద్ధమైన పోకడలపై విమర్శలు వచ్చాయి.
ఈ మధ్య కాలంలో నిజ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. 7వ తరగతి చదువుతున్న కుర్రాడు... టీచర్తో లేచి పోయి పెళ్లి చేసుకోవడం, పదవ తరగతి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన ఉపాధ్యాయురాలు లాంటి సంఘటనలు అందరినీ షాక్ కు గురి చేశాయి. 'పెహ్రిదార్ పియా కి' సీరియల్స్ ను ప్రోత్సహిస్తే ఇలాంటి దారుణాలు మరిన్ని జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
'పెహ్రిదార్ పియా కి' సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని నిషేధించాలంటూ ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ సీరియల్కు వ్యతిరేకంగా పెద్ద చర్చ జరిగింది. 'చేంజ్.ఆర్గ్' వెబ్సైట్లో ఉంచిన పిటిషన్పై లక్షమందికిపైగా సంతకాలు చేశారు.
ఫిర్యాదు నేపథ్యంలో బీసీసీసీ స్పందించి రాత్రి 9 గంటలకు బదులు పది గంటలకు ప్రసారం చేయాలని, అలాగే ఇదంతా కల్పితమని, బాల్య వివాహాలను ప్రోత్సహించడం లేదంటూ సీరియల్తోపాటే స్క్రోలింగ్ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
సోనీ టీవీలో ప్రసారం అవుతున్న 'పెహ్రిదార్ పియా కి' అనే హిందీ టీవీ సీరియల్ వివాదాస్పదం అయింది. ఈ సీరియల్ లో కొన్ని సీన్లు వివాదాస్పదంగా ఉండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదులపై ప్రసార మాధ్యమాల సంబంధిత విషయాల ఫిర్యాదుల మండలి (బీసీసీసీ) స్పందించింది. ఆ సీరియల్ రాత్రి 10 గంటల తర్వాతే ప్రసారం చేయాలని ఆదేశించింది.
తొమ్మిదేళ్ల బాలుడు, 18 ఏళ్ల యువతిని ప్రేమ, పెళ్లి లాంటి కాన్సెప్టుతో ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. ఇలాంటి సీరియల్స్ పిల్లల్లో చెడు ప్రభావాన్ని చూపుతాయని, అందుకే రాత్రి పూట మాత్రమే వీటిని ప్రసారం చేయాలని ఆదేశించారు.
బాల్య వివాహాలను ప్రోత్సహించేలా 'పెహ్రిదార్ పియా కి' సీరియల్ సీన్లు ఉండటం ఏమిటని, ఇలాంటి కాన్సెప్టుతో సమాజంలోకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చాలా మంది ఫిర్యాదులు చేశారు.
గత నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ కాన్సెప్టు కొత్తగా ఉండటంతో మంచి రేటింగ్ వచ్చింది. అయితే బాల్య వివాహాలను ప్రోత్సహించేలా, 9 ఏళ్ల పిల్లాడు తనకంటే రెట్టింపు వయసు ఉన్న యువతిని పెళ్లాడటం లాంటి విరుద్ధమైన పోకడలపై విమర్శలు వచ్చాయి.
ఈ మధ్య కాలంలో నిజ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. 7వ తరగతి చదువుతున్న కుర్రాడు... టీచర్తో లేచి పోయి పెళ్లి చేసుకోవడం, పదవ తరగతి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన ఉపాధ్యాయురాలు లాంటి సంఘటనలు అందరినీ షాక్ కు గురి చేశాయి. 'పెహ్రిదార్ పియా కి' సీరియల్స్ ను ప్రోత్సహిస్తే ఇలాంటి దారుణాలు మరిన్ని జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
'పెహ్రిదార్ పియా కి' సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని నిషేధించాలంటూ ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ సీరియల్కు వ్యతిరేకంగా పెద్ద చర్చ జరిగింది. 'చేంజ్.ఆర్గ్' వెబ్సైట్లో ఉంచిన పిటిషన్పై లక్షమందికిపైగా సంతకాలు చేశారు.
ఫిర్యాదు నేపథ్యంలో బీసీసీసీ స్పందించి రాత్రి 9 గంటలకు బదులు పది గంటలకు ప్రసారం చేయాలని, అలాగే ఇదంతా కల్పితమని, బాల్య వివాహాలను ప్రోత్సహించడం లేదంటూ సీరియల్తోపాటే స్క్రోలింగ్ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
0 comments:
Post a Comment