విశాఖలో దారుణం ప్రేమ పిచ్చి పట్టిన వెధవ చేసిన పనికి 2 ప్రాణాలు పోయాయి
ప్రేమోన్మాదం రెండు నిండు ప్రాణాలను బలికొంది. తనతో ప్రేమను అంగీకరించలేదన్న ఆక్రోశంతో ఓ యువకుడు జరిపిన ఉన్మాద చర్యకు యువతి చనిపోయింది. తన అక్కను కాపాడే క్రమంలో తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన యువకుడు కూడా రైలు కిందపడి చనిపోయాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా తగరపువలసలో జరిగింది.
తగరపువలసలోని టీ నగరపాలెంలో రూప అనే యువతి నివాసముంటోంది. తన తమ్ముడు ఉపేంద్రతో కలిసి ఉన్న రూపపై హరి సంతోష్ అనే యువకుడు దాడి చేశాడు. తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించి పరారయ్యాడు. తన అక్కకు అంటుకున్న మంటలు ఆర్పివేసే క్రమంలో తమ్ముడు ఉపేంద్ర కూడా తీవ్రంగా గాయపడ్డాడు. రూప అక్కడిక్కడే చనిపోయింది. ఉపేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే పరారైన హరి సంతోష్ కూడా రైలు కింద పడి చనిపోయాడు. యువకుడి ప్రేమోన్మాదానికి అక్క రూప చనిపోవడం తమ్ముడు ఉపేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ప్రేమోన్మాదం రెండు నిండు ప్రాణాలను బలికొంది. తనతో ప్రేమను అంగీకరించలేదన్న ఆక్రోశంతో ఓ యువకుడు జరిపిన ఉన్మాద చర్యకు యువతి చనిపోయింది. తన అక్కను కాపాడే క్రమంలో తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన యువకుడు కూడా రైలు కిందపడి చనిపోయాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా తగరపువలసలో జరిగింది.
తగరపువలసలోని టీ నగరపాలెంలో రూప అనే యువతి నివాసముంటోంది. తన తమ్ముడు ఉపేంద్రతో కలిసి ఉన్న రూపపై హరి సంతోష్ అనే యువకుడు దాడి చేశాడు. తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించి పరారయ్యాడు. తన అక్కకు అంటుకున్న మంటలు ఆర్పివేసే క్రమంలో తమ్ముడు ఉపేంద్ర కూడా తీవ్రంగా గాయపడ్డాడు. రూప అక్కడిక్కడే చనిపోయింది. ఉపేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే పరారైన హరి సంతోష్ కూడా రైలు కింద పడి చనిపోయాడు. యువకుడి ప్రేమోన్మాదానికి అక్క రూప చనిపోవడం తమ్ముడు ఉపేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
0 comments:
Post a Comment